బైడెన్ మునిమనుమరాలి పెళ్లి

Telugu Lo Computer
0


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మునిమనుమరాలు నవోమీ బైడెన్  వివాహం శ్వేత సౌధంలో జరిగింది. 28 ఏళ్ళ నవోమీ, పాతికేళ్ళ పీటర్ నీల్‌ను పెళ్లి చేసుకున్నారు. జో బైడెన్ అంతర్గత కూటమిలో నవోమీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేవిధంగా ఆయనను ప్రోత్సహించినవారిలో ఆమె ముఖ్య వ్యక్తి. హంటర్ బైడెన్, ఆయన తొలి భార్య కేథలీన్ బుహ్లేల పుత్రిక నవోమీ బైడెన్. జో బైడెన్ మొదటి కుమార్తె 1972లో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె పేరునే నవోమీకి పెట్టారు. ఆ ప్రమాదంలో ఆయన మొదటి భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు. నవోమీ బైడెన్, పీటర్ నీల్ వివాహం వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లో శనివారం జరిగింది. దేశాధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సహా దాదాపు 250 మంది అతిథులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. మీడియాను అనుమతించవద్దని వధూవరులు కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరినే జీన్-పియర్రే చెప్పారు. ఇది ప్రైవేటు కుటుంబ కార్యక్రమమని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)