ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే మా బిడ్డ చనిపోయాడు !

Telugu Lo Computer
0


తెలంగాణలో ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న బొడ్డాపు రమణ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉద్యోగ నిర్వహణలో ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే బొడ్డపు రమణ చనిపోయాడంటూ కోటబొమ్మాళి మండలం సోమనాధపురంలో నివాసముంటున్న రమణ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ఆరోపణ మాత్రమే కాదు బలంగా చెబుతున్నామంటున్నారు. రమణ సొంత ఊరు వచ్చింపుడల్లా పై అధికారులతో ఒత్తిడులు ఎక్కువగా ఉన్నాయంటూ ఉద్యోగం చేయలేకపోతున్నానంటూ తల్లిదండ్రులు వద్ద, వాళ్ళ అన్నయ్య వదినల వద్ద వాపోయావాడని బంధువర్గం చెబుతోంది. గత పది రోజుల క్రితం కూడా ఇదే ప్రస్తావన తన కుమారుడు చెప్పినట్లు వాపోయింది తల్లి. అతని చావు వెనక ప్రేమవ్యవహారం అంటూ తప్పు త్రోవ పట్టిస్తున్నారంటున్నారు. కేవలం డిపార్ట్మెంట్ లో జూబ్లీహిల్స్ పరిధి సి ఐ వల్లే చనిపోయాడంటూ ఆరోపణ బలంగా చేస్తున్నారు కుటుంబీకులు. తక్షణమే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కూడా చొరవతీసుకొని తమ కుటుంబానికి న్యాయం జరిపించాలని రమణ తల్లి, వదిన, అక్క, బావ కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)