ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం కోసం శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం అయ్యింది. 25.30 గంటల కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ ఎల్ వీ సీ54 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బిఎన్ సురేష్ అధ్యక్షతన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం జరిగింది. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ నేతృత్వంలో రాకెట్ను పరిశీలించి చివరి దశగా ప్రయోగ రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్ డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించగా, ప్రయోగ సమయం శనివారం ఉదయం 11.56 గంటలకు ప్రారంభంకానుంది. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రో యొక్క EOS-06 ఉపగ్రహం, ఎనిమిది ఉపగ్రహాలు వాణిజ్యపరంగా ఉన్నాయి.
కౌంట్డౌన్ ప్రారంభం
November 25, 2022
0
Tags