భర్త ముందే మహిళపై దొంగలు గ్యాంగ్ రేప్.!

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో 45 ఏళ్ల మహిళపై ఆమె భర్త ముందే నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు దోచుకోవాలనే ఉద్దేశంతో దంపతుల ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేతు సింగ్ మాట్లాడుతూ మహిళ భర్త వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారని చెప్పారు. బుధవారం రాత్రి దంపతులు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని బంధించారు. వారి నుండి ఆ నలుగురు వ్యక్తులు రూ.1,400 తీసుకున్నారు. మరింత నగదు, ఇతర విలువైన వస్తువులను డిమాండ్ చేశారు. అయితే కొన్ని వెండి ఆభరణాలు తప్ప దంపతుల వద్ద పెద్దగా ఏమీ లభించలేదు. దింతో దోపిడీదారులు ఆమె భర్త ముందు మహిళపై అత్యాచారం చేశారని సింగ్ పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారని, వివిధ స్టేషన్ల సిబ్బంది నిందితులను గుర్తించి వారిని వెతకడంలో నిమగ్నమై ఉన్నారని అధికారి తెలిపారు. వారిలో ముగ్గురిని శనివారం అరెస్టు చేశారు. నాలుగో నిందితుడిని కూడా బృందాలు వెంబడిస్తున్నాయని, అతడిని కూడా పట్టుకుంటామని ఆయన చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)