మెస్‌ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు !

Telugu Lo Computer
0


కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ క్యాంపస్ క్యాంటీన్ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు రావడం వివాదాస్పదమైంది. నాణ్యత లేని భోజనాన్ని తమకు పెడుతున్నారని విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ క్రమంలో క్యాంపస్ లో ఉన్న క్యాంటీన్లన్ని మూతపడ్డాయి. క్యాంపస్‌లో ఉన్న మొత్తం 4 క్యాంటీన్లలో ఒక క్యాంటీన్లో ఆహారం బాగోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనంలో పురుగులు, ఇనుప తీగలు వస్తున్నాయని, ఇలాంటి ఘటనలపై యజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక మెస్ ను మూసేశారు. అయితే విద్యార్థుల నిరసనలు చేస్తున్నారని మిగిలిన మూడు మెస్లను మంగళవారం మూసేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా క్యాంటీన్ సిబ్బంది వారిని క్యాంపస్‌లోకి అనుమతించడం లేదని చెబుతున్నారు. దీనిపై మంగళవారం ఉదయం నుంచి కాలేజీ క్యాంపస్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)