వివాహేతర సంబంధానికి వివాహిత బలి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడకు చెందిన వివాహిత ఉస్మాభేగం, ముఖిద్‌తో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆ సమయంలో ఉస్మా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్ అమ్రేహ జిల్లాకు చెందిన హెజాద్‌తో పరిచయం అయ్యింది. అలా చాట్ చేయడం, క్రమంగా అదీ ప్రేమగా మారింది. అతని మాటలు నమ్మ ఈ నెల 6వ తేదీన కలువడానికి వెళ్లింది. ఉస్మాను తాను పనిచేసే సెక్యూరిటీ కంపెనీ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఉస్మా కోరింది. దానికి అతను నిరాకరించాడు. దీనిపై ఇద్దరికీ మాట మాట పెరిగింది.ఉస్మాను చున్నీతో కట్టి.. చేతిలో ఉన్న ఇటుకతో తలపై కొట్టాడు. దానితో ఆమె  చనిపోయింది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఆమెను నిజామాబాద్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. అప్పటికే బాన్స్ వాడలో మిస్సింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు మృతికి సంబంధించిన విషయం గురించి సమాచారం ఇచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)