న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20మ్యాచ్ భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ 12 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కురుస్తుండటంతో టాస్ కూడా సాధ్యపడలేదు. వాన తగ్గితే మ్యాచ్ ను నిర్వహించాలని అంపైర్లు భావించినా వరుణుడు అందుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో మ్యాచ్ ను జరుపలేం అని ఇరు జట్ల కెప్టెన్ లకు అంపైర్లు తెలియజేశారు. రెండో టీ20 ఆదివారం జరగనుంది.
వర్షం కారణంగా తొలి టీ20 రద్దు
November 18, 2022
0