ప్లాస్టిక్ వ్యర్ధాల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్డులోని ఆర్ఎస్ పాలీమర్స్ ప్లాస్టిక్ వ్యర్ధాల గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు . వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. అయితే.. ప్లాస్టిక్‌కు సంబంధించి గోడౌన్‌ కావడంతో మంటల వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే.. ఈ ప్రమాదానికి కారణాల ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)