కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడోయాత్రలో రాహుల్గాంధీ, పార్టీ కార్యకర్తలతో కలిసి సోనియాగాంధీ కొంతదూరం నడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా, బహిరంగ సమావేశాలకు హాజరుకావడం లేదు. సుదీర్ఘకాలం తర్వాత గురువారం ఈ యాత్ర చేపట్టడం గమనార్హం. బుధవారం మైసూరులో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. బళ్లారిలో జరగనున్న ర్యాలీలో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని, బిజెపి దుకాణం కట్టేసే సమయం వచ్చిందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.శివకుమార్ తెలిపారు.