చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్‌ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని  విద్యార్థిని డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె సెప్టెంబర్‌ 29న తన చెల్లెలుతో కలసి ఒక షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది. ఆ సమయంలో సదరు విద్యార్థిని కొన్ని చాక్లెట్లను దొంగతనం చేస్తూ పట్టుబడింది. అయితే ఆ తర్వాత ఆమె సదరు షాపు యజమానికి క్షమాపణలు చెప్పి బిల్‌ పే చేసి వచ్చేసింది. కానీ ఆ ఘటనను సదరు షాపు వాళ్లు వీడియో తీసి సోషల్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. దీంతో తన కూతురు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు బాధితురాలి తండ్రి ఆవేదనగా చెబుతున్నారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని సదరు షాపు వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. అంతేగాదు ఆ వీడియోని ఆన్‌లైన్‌ పోస్ట్‌ చేసి ఆమె మృతికి కారణమైన వాళ్లని గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడమే గాక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)