తమిళంలో వైద్య విద్యకు ప్రతిపాదన !

Telugu Lo Computer
0


లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ ఇసై సౌందరరాజన్ పుదుచ్చేరి ప్రభుత్వం తమిళ్ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించాలని ప్రతిపాదించిందన్నారు. సీనియర్ సిటిజెన్ల గౌరవార్థం ఏర్పాటుచేసిన ఓ వేడుక తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. తమిళ్ మీడియం ఎంబిబిఎస్ కాలేజ్ తెరవడానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి రంగసామితో సంప్రదిస్తానని కూడా ఆమె తెలిపారు. "వైద్య విద్యకు సంబంధించిన పుస్తకాలను తయారుచేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు" ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రజలపై ఏ బాషను రుద్దడంలేదని, కాకపోతే వారు మాతృ భాషలోనే వృత్తి విద్య కళాశాలలను తెరవాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. పుదుచ్చేరిలో పాల కొరతను నివారించేందుకు తాము చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)