తల్లి కూతుళ్లు సజీవ దహనం

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డోంబివిలీలో ఒక వ్యక్థి ఘోరమైన అకృత్యానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యని, కూతుళ్లను నిర్ధాక్షణ్యంగా సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, ఇద్దరు కూతుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం  ఈ ఘటనలో నిందితుడి భార్య 35 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కూతుళ్లు సమీర(14), సమీక్ష(11) 90 శాతం తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అలాగే నిందితుడు ప్రీతీ శాంతారామ్‌ పాటిల్‌ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడని, అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. పోలీసులు విచారణలో నిందుతుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యని కూతుళ్లను వేధిస్తున్నాడని, అందులో భాగంగానే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.  ఈ ఘటన శనివారం సాయంత్రం 5.30 గం.ల ప్రాంతంలో జరిగితే సుమారు 8.30 గం.లకు అంటే దాదాపు మూడు గంటల ఆలస్యంతో వెలుగులోకి వచ్చిందని, అందువల్లే బాధితులు తీవ్రంగా గాయలపాలయ్యారని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)