పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటేశ్వర రెడ్డి

Telugu Lo Computer
0


గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా ప్రకాశం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మీగడ వెంకటేశ్వర రెడ్డి పేరు ఖరారైంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను బరిలోకి నిలపాలని యూటీఎఫ్‌ ప్రతిపాదించగా ఎస్‌టీయూతో పాటు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. వెంకటేశ్వర రెడ్డి స్వగ్రామం కనిగిరి మండలంలోని గుండ్లపాలెం. కనిగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, చీరాల వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాలలో డిగ్రీ, గుంటూరు ఏఎల్‌ కళాశాలలో బీఈడీ పూర్తిచేశారు. 1984లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా యర్రారెడ్డిపాలెంలో చేరారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, పీఎస్‌ అసిస్టెంట్‌గా తాళ్లూరు, పామూరు, సంతనూతలపాడు, కంచర్లవారిపల్లె, చింతలపాలెం ఉన్నత పాఠశాలల్లో పనిచేసి నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిగా సేవలందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)