ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండచరియలు

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడటంతో శిక్షణలో ఉన్న పర్వతారోహకులు వాటి కింద చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల్లో 8మందిని రక్షించి హాస్పిటల్ కు తరలించారు. ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెయినీర్ ఇన్స్టిట్యూట్కు చెందిన 40 మంది ద్రౌపది దండా 2 పర్వతారోహణకు వచ్చారు. వారిలో 33 మంది ట్రైనీలు, ఏడుగురు ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. అయితే ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో వారిలో 29మంది దాని కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ దళాలు రెస్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 8 మందిని రక్షించగా.. వారిని చికిత్స కోసం డెహ్రాడూన్ కు తరలించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)