వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి !

Telugu Lo Computer
0


అమెరికాలోని వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ పాల్గొన్నారు. దీపాలను వెలిగించి బైడెన్ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మందికి పైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. యూఎస్‌లో ఉన్న భారతీయులకు బైడెన్, కమలాహారిస్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. పండుగ సందర్భంగా దీపాలను వెలిగించడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. దీపావళి వేడుకలను అమెరికా సంస్కృతిలో భాగంగా మారిందని, ప్రవాస భారతీయులకు కమలాహారిస్ ధన్యవాదాలు తెలిపారు. 'ఈ వైట్‌హౌస్‌ ప్రజల ఇల్లు, మా అధ్యక్షురాలు, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌తో కలిసి సంప్రదాయ వేడుకను నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని కమలాహారిస్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)