పాత బస్తీలో రౌడీ షీటర్‌ దారుణ హత్య

Telugu Lo Computer
0


అర్ధరాత్రి పాతబస్తీ భవానీ పోలీస్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కలకలం సృష్టించింది. కుమార్ వాడి ప్రాంతంలో.. రైన్ బజార్‌కి చెందిన రౌడీ సీటర్ సయ్యద్ భక్త్యారాగ అలియాస్ మహ్మద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తితో దాడి చేయడంతో అపస్మారక స్థితికిలోకి వెళ్లాడు. రౌడీషీటర్ మహ్మద్‌ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు దృవీకరించారు. గత కొంత కాలంగా విదేశాల్లో ఉన్న మహ్మద్‌ తాగా హైదరాబాద్‌కి వచ్చాడు. మరో రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈలోగా ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది. ఇది పాత కక్షలకు సంబంధించిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)