రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం !

Telugu Lo Computer
0


డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరోసారి రికార్డు స్థాయిలో పతనమైంది. ఇవాళ కరెన్సీ ట్రేడింగ్ లో రూపాయి విలువ 71 పైసలు తగ్గి 83 రూపాయల రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. ఈ ప్రభావంతో అప్పటిదాకా లాభాల బాటలో నడిచిన భారత స్టాక్ మార్కెట్లు ఉదయం 11.20 గంటల తర్వాత నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.39 గంటల సమయానికి 59,377 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్.. ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి దాదాపు 270 పాయింట్లు కోల్పోయి 59,107 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడింగ్ సెషన్ లో ఒకానొక దశలో 17,601 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టీ.. క్రమంగా తగ్గుతూ వచ్చి మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపు 105 పాయింట్లను కోల్పోయి 17,496కి పడిపోయింది. చివర్లో కొంత కోలుకొని 17,512 పాయింట్ల వద్ద ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)