పోలీసు బస్సు కింద పడి ముగ్గురు సజీవ దహనం

Telugu Lo Computer
0


బీహార్ లో పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సు చప్రా సివాన్ హైవేపై బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. పోలీస్ బస్సును ఢీకొట్టిన సమయంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బైకు పై వస్తున్న వారంతా మంటల్లోనే కాలిపోయారు. ఆ బస్సులో బీహార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డయోరియా గ్రామ సమీపంలోకి రాగానే బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడంతో వారిలో ఒకరు బైక్ తో సహా బస్సు కింద ఇరుక్కు పోయారు. దీంతో ఒక్క సారిగా ఇంధన ట్యాంకు పేలి మంటలు చుట్టుముట్టాయి. ముగ్గురు ఆ మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు రావడంతో పోలీసు అధికారులు దిగిపోయారు. సితాబ్ధియారాలో దివంగత రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ జయంతి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)