డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలోని సఖినేటిపల్లి నుంచి నరసాపురం వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు మలికిపురం మండలం దిండి గ్రామంలో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్, స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మలికిపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, బస్సు నుజ్జునుజ్జైనా.. విద్యార్థులంతా క్షేమంగా బయటపడడంతో.. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న విద్యార్థులు
October 21, 2022
0
Tags