9 మందిని బలిగొన్న పులి హతం !

Telugu Lo Computer
0


బీహార్‌లోని చంపారన్ జిల్లా, బగాహా ప్రాంతంలో ఒక పులి స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఏకంగా తొమ్మిది మందిపై దాడి చేసి చంపేసింది. గత మూడు రోజుల్లోనే నలుగురిని చంపింది. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పులి దాడి చేసి ప్రజల్ని చంపేస్తుండటంపై అధికారులు స్పందించారు. ఈ అంశంలో పులిని అడ్డుకుని, మనుషుల ప్రాణాలు కాపాడాలంటే పులిని చంపడం ఒక్కటే మార్గమని భావించారు. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిపై పూర్తి సమాచారం అందుకున్న ప్రభుత్వం స్పందించింది. పులిని చంపేందుకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ అనుమతించింది. మనుషుల ప్రాణాలను పులి బలి తీసుకుంటోందని, ఇది మానవ నివాసాలకు ప్రమాదమని భావించిన ప్రభుత్వం పులిని చంపేందుకు అధికారులకు అనుమతి మంజూరు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పులిని వేటాడి చంపేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)