ఈ శునకం ఖరీదు రూ.10 కోట్లు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని శివమొగ్గలో దసరా వేడుకల్లో భాగంగా రాష్ట్ర స్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శన జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు పోటీల్లో పాల్గొన్నారు. 22 జాతుల శునకాలతో వాటి యజమానులు వచ్చారు. బెంగళూరుకు చెందిన వ్యాపారి, జాగిలాల ప్రియుడు 'కడబం' సతీశ్‌ తీసుకొచ్చిన టిబెటియన్‌ మస్టిఫ్‌ జాతి జాగిలం 'భీమ' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.10 కోట్లు ఖర్చు చేసి, గత ఏడాది చైనాలోని బీజింగ్‌ నుంచి ప్రత్యేక విమానంలో భీమను తెప్పించినట్లు ఆయన చెప్పారు. ఈ జాగిలంతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. భీమ కోసం ఏసీ గది సదుపాయాలతో పాటు ఆహారానికి నెలకు రూ.25 వేలు ఖర్చు చేస్తున్నట్లు సతీశ్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)