పాయసంలో కప్ప !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గృహంలో పాయసంలో కప్ప రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో ఎస్‌ఎఫ్‌ఐ, ఆర్‌వీఎస్‌ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాయసంలో కప్ప పడితే తీయకుండా అలాగే ఉడికించి విద్యార్థులకు వడ్డించడం దారుణమన్నారు. వార్డెన్లకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులు వసతి గృహంలో ఆహారం తినాలంటే భయమేస్తోందని, బాధ్యులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఉప కులపతి సూర్య కళావతి అక్కడికి చేరుకుని వారి సమస్యలు విని వసతి గృహాలను సందర్శించారు. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై మండిపడ్డారు. ఇలాంటి తరహా ఘటనలు పునరావృతమైతే తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్డెన్లు రోజూ వసతి గృహాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)