యువతిపై సెక్యూరిటీ గార్డు అఘాయిత్యం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో యువతిని గదిలో బంధించి సెక్యూరిటీగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఈ నెల 4న జరిగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజరాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి.. అదే ప్రాంతంలోని ఓ మాల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చిన్మయి సైక్యా (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువకుడు యువతిపై కన్నేశాడు. ఈ నెల 4న బాధితురాలి ఇంటికి ఏదో పని ఉందంటూ వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన అతను యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని యువతిని బెదిరించాడు. ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని ఆ యువతి మరుసటి రోజు ఉదయం తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెస్సెజ్ పంపింది. వెంటనే ఆమె బాధితురాలి సోదరికి ఈ విషయాన్ని చెప్పింది. వెంటనే ఆమె బాధితురాలిని ప్రశ్నించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)