భార్య లేచిపోయిందన్న మనస్థాపంతో భర్త ఆత్మహత్య !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని   గౌతం బుద్ద్ నగర్ జిల్లా నివాసి అయిన కవిందర్ హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఓ గ్రామంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పని చేయడంతో పాటు క్యాబ్ నడుపుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. అయితే ఇటీవలే భర్త పిల్లలను కాదని  పొరుగింటి వ్యక్తి రామ్ వీర్ తో కలిసి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో కవిందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రామ్ వీర్ తో కలిసి రీనా పారిపోయింది అన్న విషయాన్ని తేల్చారు. భార్య చేసిన పనికి కవిందర్ తీవ్ర మనస్తాపం చెందాడు. భార్యే ప్రాణంగా బ్రతికిన అతను చివరికి భార్య వేరొకరితో పారిపోవడానికి జీర్ణించుకోలేకపోయాడు. చివరికి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కవిందర్ ను గమనించిన సోదరుడు సంతోష్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కవీందర్ సోదరుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)