కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్షాతో రహస్యంగా సమావేశమైనట్టు బీజేపీలోని ఉన్నత వర్గాల సమాచారం. వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ సమావేశానికి జార్ఖండ్లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్ దూబే మధ్యవర్తిత్వం వహించారని సమాచారం. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా అమిత్షా ఆహ్వానించినట్టు తెలిసింది. దీనికి రాజగోపాల్రెడ్డి సైతం దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం. వ్యాపారవేత్తలైన రాజగోపాల్రెడ్డి, నిషికాంత్ దూబే మధ్య కొన్నేండ్లుగా సాన్నిహిత్యం ఉన్నదని, రాజగోపాల్రెడ్డి జార్ఖండ్లో కాంట్రాక్ట్లు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ స్నేహంతోనే ఈ భేటీకి దూబే మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తున్నది.
బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ?
July 22, 2022
0
Tags