మురళి మృతిపై అనుమానాలు !

Telugu Lo Computer
0


శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస గ్రామానికి చెందిన బుడుమూరి మురళి (43) ఆఫ్రికాలోని ఓ దేశంలో ప్రొపెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన భార్య, ఆరేళ్ల వయస్సున్న కొడుకు విశాఖపట్నం లోని కొమ్మాది సమీప రిక్షా కాలనీలో ఉంటున్నారు. ఈ నెల 9వ తేదీన మురళి సెలవుపై ఇంటికొచ్చారు. రెండు రోజుల తర్వాత తన భర్త శ్రీకాకుళంలో ఉన్న అతని తల్లిని చూసేందుకు వస్త్రాలతో బ్యాగ్‌, రూ.5 లక్షల నగదుతో బయలు దేరగా, తాను కొమ్మాది సినిమాహాలు వద్ద దింపానని, రెండు రోజులు గడిచినా భర్త అక్కడికి చేరుకోలేదు' అంటూ ఈనెల 12న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బుధవారం మారికవలస బ్రిడ్జి కింద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి పరిశీలించగా శరీరం పూర్తిగా కాలిపోయి ఉంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేయగా ఆ వ్యక్తి ఆచార్యుడు మురళిగా గుర్తించారు. నిందితులను గుర్తించేందుకు రిక్షా కాలనీ-కొమ్మాది మార్గ మధ్య సీసీ టీవీ ఫుటేజీలను, మృతుని కుటుంబీకుల కాల్‌డేటాను సేకరించారు. కొందరిని స్టేషన్‌ను పిలిపించి విచారణ జరుపుతున్నారు. సాయిరాం కాలనీకి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని గురువారం కేజీహెచ్‌ శవాగారానికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)