భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగి

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాధ్ ఈ ఉదయం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యోగితోపాటు బండి సంజయ్, రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. యోగి పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)