రీ పోస్ట్‌మార్టంకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

Telugu Lo Computer
0


తమిళనాడులో పన్నెండో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలిక రాసిన సూసైడ్ నోట్ కీలకంగా మారింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి స్టాలిన్ సీరియస్‌గా తీసుకోవడంతో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. చెన్నై సమీపంలోని కళ్ళకూరుచిలో బాలిక ఆత్మహత్య ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్న సేలం గ్రామానికి చెందిన శ్రీమది, ఓ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతూ హాస్టల్‌లోనే ఉంటోంది. హాస్టల్‌ భవనం మీద నుంచి దూకి శ్రీమది ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల తర్వాత సూసైడ్ నోట్ దొరికింది. ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో రాసింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థినులపై దాడులను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థిని మృతదేహానికి రీ- పోస్ట్‌మార్టం చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆందోళనలో పాల్గొన్న 108 మందికి 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను పోలీసులు విచారించారు. బాలిక మృతికి ఆ స్కూల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ వారితో కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా మారాయి. విద్యాసంస్థకు సంబంధించిన బస్సులతో పాటు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)