గర్భం దాల్చినట్లుగా బ్లాక్‌మెయిల్‌ !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని పూణేలో వ్యాపారి అయిన బంధువు వద్ద 26 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో కోరెగావ్ భీమా ప్రాంతంలోని ఒక లాడ్జిలో బస చేసిన సందర్భంగా ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెతో సంబంధానికి దారి తీసింది. దీంతో ఆ మహిళకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవాడు.ఆ మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని బ్లాక్‌మెయిల్‌ చేసింది. హడప్సర్‌లో నివాసం ఉండే 26 ఏళ్ల చేతన్ రవీంద్ర హింగ్‌మీర్‌ను భర్తగా, 27 ఏళ్ల నిఖిల్ అలియాస్ గౌరవ్ మ్హెత్రేని సామాజిక కార్యకర్తగా పరిచయం చేసింది. తాను ప్రెగ్నెంట్‌ అని, రేప్‌ కేసు పెడతానంటూ ఆ వ్యక్తిని బెదిరించింది. దీంతో ఆ ముగ్గురు కలిసి అతడి నుంచి పలు దఫాలుగా రూ.67.07 లక్షలు వసూలు చేశారు. అయితే మరింతగా డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో ఆ వ్యక్తి కోంద్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ హేమంత్ పాటిల్ నేతృత్వంలో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. మహిళ స్నేహితులైన రవీంద్ర, నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)