ఉత్తరాఖండ్ లో ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లో  అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ప్రభుత్వ పథకం ప్రకారం, అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు కేటాయించింది. కేబినెట్‌ సమావేశం అనంతరం చీఫ్‌ సెక్రటరీ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఈ ప్రాజెక్టు గురించి మీడియాకు వివరించారు. 1,84,142 అంత్యోదయ కార్డుదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉచిత ఎల్‌పిజి సిలిండర్‌తో పాటు, గత సంవత్సరాల్లో గోధుమలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు క్వింటాల్‌కు రూ.20 బోనస్‌ను కూడా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన వివరించారు. లబ్ధిదారుడు ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసి అయి ఉండటం తప్పనిసరి, వ్యక్తి తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి, అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేయాలి. ఈ పథకాన్నిపొందాలనుకుంటే జూలైలోనే అంత్యోదయ కార్డ్‌ని ఎల్పీజీ కనెక్షన్ కార్డ్‌తో లింక్ చేయండి. మీరు ఈ రెండింటిని అనుసంధానించకుంటే ఈ ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కోల్పోతారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని లాంఛనాలను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అంత్యోదయ రేషన్ కార్డుదారుల జాబితాను సిద్ధం చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు పంపింది. కాబట్టి అంత్యోదయ కార్డు హోల్డర్లు వీలైనంత త్వరగా తమ గ్యాస్ కనెక్షన్‌కి కనెక్ట్ చేసుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)