నేడు శ్రీవారి ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల

Telugu Lo Computer
0


ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్‌ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీలకు చెందిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. వారి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు టీటీడీ అధికారులు. ఇదిలా ఉంటే.. నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.. విరాళాలు రూ.6.18 కోట్లుగా తెలిపింది. ఇప్పటిదాకా 2012 ఏప్రిల్ 1న తిరుమల వెంకన్న హుండీకి ఒకరోజు అత్యధికంగా లభించిన ఆదాయం రూ.5.73 కోట్లు. ఇప్పుడు మొట్టమొదటిసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది.. ఇప్పుడు 2012 రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)