ముస్లిం మత గురువు దారుణ హత్య

Telugu Lo Computer
0


సూఫీ బాబాగా పిలిచే ముస్లిం మత గురువును గుర్తు తెలియని వ్యక్తులు మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో దారుణ హత్య చేశారు. అఫ్ఘనిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల మత గురువు మంగళవారం నాసిక్ లోని యోలా పట్టణానికి వచ్చాడు. ముంబైకు 200కిలోమీటర్ల దూరంలోని ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతుడ్ని ఖ్వాజా సయ్యద్ చిష్టీగా గుర్తించారు. దుండగులు నుదుటిపై కాల్పులు జరపడంతో అక్కడే మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూఫీ బాబాను హత్య చేసిన అనంతరం, అతనికి సంబంధించిన SUVని తీసుకుని దుండగులు పారిపోయారు. అనుమానస్పద వ్యక్తుల హత్య కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)