ఆగస్టు 9న థియేటర్లలో మళ్లీ పోకిరి విడుదల

Telugu Lo Computer
0


పోకిరి సినిమా రిలీజై 16 ఏళ్లు దాటినా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అభిమానులు వదలకుండా వీక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమా మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఆగస్టు 9న మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో పోకిరి సినిమాను విడుదల చేయబోతున్నారు. 4K ఆల్ట్రా హెచ్‌డీ, డాల్బీ ఆడియో టెక్నాలజీతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మహేష్ అభిమానులు PokiriManiaBegins అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు థియేటర్లలో పోకిరి ప్రత్యేక ప్రదర్శనలు వేసేందుకు మహేష్ అభిమాన సంఘాలు సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 9న మరోసారి పోకిరి సినిమాను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మూవీలో ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అంటూ మహేష్ చెప్పిన డైలాగ్‌ను ఎవరూ మరిచిపోలేరు. ఈ డైలాగ్‌లో పలువురు కమెడియన్‌లు తమ సినిమాల్లో స్పూఫ్‌లు కూడా చేశారు. ఈ చిత్రంలో మహేష్ సరసన ఇలియానా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం, మణిశర్మ సంగీతం ఈ మూవీని టాప్‌లో నిలబెట్టాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)