దేశంలో కొత్తగా 13,086 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,086 కేసులు నమోదైయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు వచ్చాయి. నిన్న 16వేలకుపైగా కేసులు వెలుగు చుశాయి. తాజాగా 12,456 మంది కోలుకున్నారు. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.14లక్షల మార్క్‌ను దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ 4,35,31,650కేసులు నమోదైయ్యాయి. ఇందులో 4,28,91,933 మంది కోలుకోగా, 5.25లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,14,475 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)