బాలుడు ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజు పురం అగ్రహరంలో ఉండు ఎస్‌.వెంక టే ష్‌, రాజేశ్వరి ఏకైక కుమారుడు ఎస్‌.బాలాజీ (14) ముక్కవారిపల్లి లోని ఓ ప్రైవెట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం బాలాజీ తల్లి దండ్రులు రైల్వేకోడూరు పట్టణానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. వెంటనే స్థానికుల సాయంతో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలాజీ మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో తల్లి దండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు. మరణవార్త వినగానే గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారి స్తున్నాట్లు ఎస్‌.ఐ వెంకట నరసింహం తెలిపారు. కాగా బాలుడి మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)