రేపు టెన్త్‌ ఫలితాలు విడుదల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత శనివారం ఉదయం 11 గంటలకే ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఆ సమయం దాటిన తర్వాత ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు అర్ధంతరంగా ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మంత్రి బొత్స, అధికారుల మధ్య సమన్వయలోపం.. సీఎం కార్యాలయ ఆదేశాలతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)