ముస్లిం ఫకీర్లపై వేధింపులు !

Telugu Lo Computer
0


పొట్టకూటి కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఫకీర్లను పట్టుకుని జిహాదీలు, టెర్రరిస్టులు అంటూ దూషణకు దిగారు. అంతే కాకుండా ఒక వ్యక్తి కర్రతో వచ్చి వారి చేత బలవంతంగా 'జై శ్రీరాం' నినాదాలు చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోండా ప్రాంతంలోని డెగూరు అనే గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియో ప్రకారం భిక్షటనకు వచ్చిన ముగ్గురు ఫకీర్లను కొద్ది మంది యువకులు ఆపారు. వారి మతాన్ని ప్రస్తావిస్తూ బూతులు తిట్టడం ప్రారంభించారు. డబ్బులు కలెక్ట్ చేసుకుని బిర్యాణి తింటారని, జిహాదీలని, టెర్రరిస్టులని దూషించారు. అంతే కాకుండా వారిని ఐడీ కార్డులు చూపించమంటూ ఇబ్బందికి గురి చేశారు. యువకుల్లో నుంచి ఒక వ్యక్తి వారిని కొట్టండని పలుమార్లు అన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి కర్రతో అక్కడికి వచ్చి జై శ్రీరాం నినాదాలు చేయించాడు. అదే సమయంలో వారితో గుంజీలు తీయించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)