టెన్త్ క్లాస్ ర్యాంకులు ప్రచారం చేయకూడదు !

Telugu Lo Computer
0


టెన్త్ క్లాస్ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని.. విద్యా సంస్థలను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను కప్పిపెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, పేరెంట్స్ నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులను లైట్ తీసుకోవాడానికి వీల్లేదు. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే రూ.లక్ష వరకు ఫైన్ విధించే అధికారం కూడా ఉందని వెల్లడించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలను నడుచుకోవాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)