భార్యను తగులబెట్టాడు

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని భివండీ తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంతోశ్‌ చౌరసియా తన భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలిసి చావింద్రలోని మహం కాళి దాబా ప్రక్కనే ఉన్న గుడిసెలో నివసిస్తున్నారు. కూలి పనిచేసే సంతోష్‌ వ్యసనాల కారణంగా పనికిపోక తరుచుగా భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం మద్యం సేవించిన సంతోశ్‌ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆవేశంతో సంతోశ్‌ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పహతప్పిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వ చేసిన కర్రల కుప్ప దగ్గరకు కవితను లాకొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి నిప్పు అంటించి హత్యచేసి పారిపోయాడు. పోలీసులు నిందుతున్ని అరెస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)