భర్తపై కోర్టుకెక్కిన భార్య !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, మహాలక్ష్మినగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ అదే ప్రాంతంలో ఉంటున్న 32 ఏళ్ల దిలేశ్వర్‌ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్దిరోజులకే ఆమెను తన భర్తతోపాటు అత్త వేధించడం ప్రారంభించారు. ఆ తర్వాత బాధితురాలిని తీసుకుని దిలేశ్వర్.. పుణెలో కాపురం పెట్టాడు. కొద్దిరోజులకే బాధితురాలి అత్త అక్కడికి కూడా వచ్చింది. బాధితురాలిని తీవ్రంగా వేధించి ఇరువురూ ఇబ్బంది పెట్టారు. ఇక, ఆమె ఎదురుతిరగడం వల్ల కన్నవారింటికి పంపించేశాడు భర్త. ఎన్ని రోజులైనా తీసుకువెళ్లడానికి రాకపోవడం వల్ల ఆమె మహిళా పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హైకోర్టులోనూ పిటిషన్​ వేసింది. అప్పుడు ఆ ఫిర్యాదులో తన భర్త వింత చేష్టలను పేర్కొంది. తన భర్త చేసే వింత చేష్టలను.. పిటిషన్‌లో తెలియజేసింది. పెళ్లైన తర్వాత ఒక్కసారి కూడా తనతో లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని తెలిపింది. తాను ప్రయత్నించినా వేరే గదిలో పడుకునేవాడిని చెప్పింది. సాయంత్రం ఆడవారిలా మేకప్​ వేసుకునేవాడని, చెవిపోగులు ధరించేవాడని పిటిషన్‌లో వెల్లడించింది . అలాగే పెదవులకు లిప్​స్టిక్​ పూసుకునేవాడని.. అలా చెయ్యొదని వారించినా చేయి చేసుకునేవాడిని ఆరోపించింది. ఆమె పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతి నెలా రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)