బీజేపీ నేతలు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువు పోతోంది. ముస్లింలపై తరచూ ఆ పార్టీ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో అరబ్ కంట్రీలు రియాక్టయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నుపూర్ శర్మ, నవీన్కుమార్ జిందాల్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు ఏకంగా భారత రాయబార్లకు సమన్లు పంపాయి. దీంతో భారత్ తరఫున ఆయా దేశాలకు బీజేపీ క్షమాపణ తెలిపింది. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని ప్రకటించింది. ఐతే బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలో చెప్పాలంటూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పు చేసిన బీజేపీయే క్షమాపణ చెప్పాలి. విద్వేషం వెదజల్లుతున్నందుకు దేశ ప్రజలకు కూడా బీజేపీ నేతలు సారీ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీజేపీ వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి !
June 06, 2022
0
Tags