తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన కొమ్ము రవి.. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి కాకతీయ కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన కొడుకు మృతిపై అనుమానం ఉందంటూ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా నిజాలు బయటకు వచ్చాయి. ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో గోదావరిఖని కార్పొరేటర్ భర్తనే సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసింది గోదావరిఖని వాసులేనని నిర్ధారించారు. కోటి రూపాయల విలువైన భూమి కోసం గోదావరిఖనికి చెందిన ముఠాకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమానంతో పూడ్చిన శవాన్ని తీసి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టంలో హత్యగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Post Top Ad
adg
Thursday, 9 June 2022
Home
Criem
telangana
ఆస్తికోసం సొంత బావమరిదినే హత్య చేయించాడు !
ఆస్తికోసం సొంత బావమరిదినే హత్య చేయించాడు !
ఆస్తికోసం సొంత బావమరిదినే హత్య చేయించాడు !
Tags
# Criem
# telangana
# ఆస్తికోసం సొంత బావమరిదినే హత్య చేయించాడు !
About Telugu Post
ఆస్తికోసం సొంత బావమరిదినే హత్య చేయించాడు !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment