యువకుడి గోడు విన్న ముఖ్యమంత్రి

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని సంగ్రూర్ ఉపఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఆదివారంనాడు రోడ్‌షోలో పాల్గొన్న సమయంలో యువకుడితో మాన్ సంభాషిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ  షేర్ చేసింది. సీఎం రోడ్‌షో జరుపుతుండగా యువకుడు చేతులు ఊపడంతో మాన్ తన కార్ ని ఆపారు. వెంటనే ఆ యువకుడు ఆయనతో మాట్లాడాలంటూ చేయి ముందుకు చాపాడు. సీఎం అతని చేతిని అందుకుంటూ ఓపిగ్గా అతనితో సంభాషించారు. ''అగ్నిపథ్ అమలుకు ముందే నేతలంతా సమవేశమై దానిపై చర్చించాలి'' అని ఆ యువకుడు సీఎంకు విన్నవించాడు. దీనికి ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, ఎంపీలు అగ్నిపథ్‌పై చర్చించేందుకు సమావేశమైతే తాను వ్యక్తిగతంగా అక్కడకు వెళ్తానని ఆ యువకుడికి భరోసా ఇచ్చారు. "భగవంత్ మాన్‌ను పంజాబ్ ఎందుకు ప్రేమిస్తుందనడానికి కారణం ఇదే'' అంటూ ఆప్ అఫీషియర్ ట్విట్టర్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ ఇటీవల పోటీ చేసి గెలుపొందారు. అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేశారు. దీంతో సంగ్రూర్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)