కరోనా వైరస్తో జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ & సొసైటీ డాక్టర్ రాకేష్ మిశ్రా ప్రజలకు సూచించారు. కేసుల సంఖ్య అధికంగానే ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలన్నారు. వేరియంట్లూ వస్తూనే ఉంటాయని, అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వ్యాపిస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకునేంత వరకు ఫర్వాలేదన్నారు.
మాస్క్లు, భౌతిక దూరం పాటించండి !
June 06, 2022
0
Tags