యువకులపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులపై నుంచి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)