అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

Telugu Lo Computer
0


అమెరికాలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో  32 ఏళ్ల సత్నామ్ సింగ్, శనివారం మధ్యాహ్నం స్నేహితుడి నుంచి కారు తీసుకున్నాడు. ఒక వ్యక్తిని రిసీవ్‌ చేసుకునేందుకు ఇంటికి సమీపంలోని సౌత్ ఓజోన్ పార్క్ వద్ద కారు నిలిపి వేచి ఉన్నాడు. ఇంతలో గుర్తు తెలియని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి డ్రైవింగ్‌ సీటులో కూర్చొని ఉన్న సత్నామ్ సింగ్‌పై గన్‌తో కాల్పులు జరిపాడు. బులెట్‌ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. సత్నామ్‌ సింగ్‌ చాలా మంచి వాడని పొరుగు వారు విచారం వ్యక్తం చేశారు. మరోవైపు న్యూయార్క్‌ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కారులో వచ్చిన వ్యక్తి సత్నామ్ సింగ్‌పై కాల్పులు జరిపినట్లు స్థానికుల్లో ఒకరు పోలీసులకు చెప్పాడు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి సత్నామ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడా లేక కారు యజమానిగా పొరపడి ఈ హత్య చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)