నదిలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌

Telugu Lo Computer
0


ఒడిస్సాలోని నయాగఢ్‌ జిల్లాలో ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్‌ ట్యాంకర్‌.. పారదీప్‌ నుంచి నయాగఢ్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో నయాగఢ్‌ జిల్లాలోని ఇటామటి వద్ద ఉన్న పండుసురా వంతెన వద్ద నదిలో పడిపోయింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ట్యాంకర్‌లో ఉన్న నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కటక్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)