అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి- చింతూరు ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోనసీమ జిల్లా నుంచి కొబ్బరికాయల లోడుతో లారీ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్తోంది. మారేడుమిల్లి మండలంలోని వాలమూరు సమీపాన ఘాట్రోడ్డులోని ప్రమాదకర మలుపులో వాలి సుగ్రీవ బొమ్మల వద్ద బోల్తా పడింది.
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లారీ బోల్తా
June 20, 2022
0