అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాలలు

Telugu Lo Computer
0


అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విధ్వంసం కొనసాగుతోంది. ఈరోజు కూడా బీహార్‌లో యువత చెలరేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనకారులు బీహార్‌లోని లఖ్మినియా రైల్వే స్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేసి రైళ్లను నిలిపివేశారు. నాలుగేళ్ల ఉద్యోగం పేరుతో అగ్నిపథ్ స్కీమ్‌ను రక్షణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. భగల్‌పూర్‌, న్యూఢిల్లీ మధ్య నడిచే విక్రమ్‌శిలా ఎక్స్‌ప్రెస్‌, జమ్మూతావి-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలని 72 గంటల డెడ్‌లైన్ జారీ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆర్మీ అభ్యర్థులు భారీ విధ్వంసాన్ని సృష్టించారు. స్టేషన్‌లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఫ్లాట్‌ఫాంపై ఉన్న రైలుకు నిపుపెట్టారు. ఏసీ బోగీల అద్దాలను పగులగొట్టారు. గూడ్స్ రైలులో ఉన్న సామాన్లను పట్టాలపై పడేశారు. ఫ్లాట్‌ఫామ్‌పైన ఉన్న షాపులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన ప్రయాణికులు స్టేషన్ విడిచి వెళ్తుతున్న దృశ్యాలు కనిపించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)