దేశంలో 9,923 కొత్త కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. 22.4 శాతం తక్కువ. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,33,19,396కి చేరింది. గడిచిన 24గంటల్లో దేశంలో 17 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మరణించారు. తాజా మరణాలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,24,890 కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 2,613 నమోదు కాగా, దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 79,313కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ.. 7,293 మంది కోలుకున్నారు, దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరుకుంది. రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)